నేడు గుడివాడకు సీఎం జగన్‌.. టిడ్కో ఇళ్ల పంపిణీ

-

 

కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్ పర్యటించనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ లో టిడ్కో ఇళ్ళ పంపిణీ కోసం సీఎం జగన్‌ గుడివాడ వెళ్లనున్నారను. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గుడివాడ కు బయలుదేరనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్.

తొమిదిన్నరకు గుడివాడ మల్లయ్యపాలెంకు చేరుకోనున్న సీఎం జగన్‌… మల్లయ్యపాలెం జగనన్న కాలనీలోని టిడ్కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎమ్ జగన్… హెలిపాడ్ దగ్గర స్థానిక పార్టీ నేతలతో ఇంటరాక్ట్ కానున్నారు. అనంతరం… మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news