వైజాగ్‌ బీచ్‌ రోడ్డులో సీఎం జగన్‌ విలాసవంతమైన ఇళ్లు !

-

ఏపీ రాజధానిని వైజాగ్‌ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని త్వరలో విశాఖకు తరలిపోతుందని, తాను అక్కడి నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రకటించారు. పలువురు మంత్రులు సైతం కొంత కాలంగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగానికి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు.

అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం మౌఖిక ఆదేశాలు అందుతున్నట్టు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు సంబంధించిన సమాచారం ఏ క్షణంలో వచ్చిన ఏర్పాటు చేసేందుకు వీలుగా అధికారులు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని భవనాలను మూడో కంటికి తెలియకుండా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉండడానికి బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. అన్ని అనుకూలిస్తే మార్చి 22, 23 తేదీల్లో గృహప్రవేశం ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news