నేడు “జగనన్న విద్యాదీవెన” నిధులు విడుదల..11.02 లక్షల విద్యార్థులకు లబ్ది

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పర్యటన ఖరారైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి బయలుదేరి 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.

అక్కడ నుంచి హెలికాప్టర్లో 11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడినుండి 11:30 గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం.. జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఈ పథకం ద్వారా ఇవాళ ఏకంగా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చెందనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news