నేడు ఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, షాలతో భేటీ!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి 7:30 గంటలకు ఆయన హస్తినకు పయనం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఓవైపు నేడు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశం జరుగుతుండగా.. సాయంత్రం ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడం పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు సీఎం జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్రంలోని సమస్యలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలకు సంబంధించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాజధాని అంశంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news