రేపు కృష్ణా జిల్లా పర్యటనకు సీఎం జగన్

-

రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లాలోని పెడనలో వైయస్సార్ నేతన్న నేస్త0 నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు సీఎం జగన్. అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం. బంటుమిల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.

ఇదిలా ఉండగా నేడు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీమకుర్తిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొననున్నారు సీఎం వైయస్‌ జగన్‌. అనంతరం బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌… ప్రసంగించనున్నారు.

ఇక 10.35 గంటలకు చీమకుర్తి చేరుకోనున్న సీఎం వైయస్‌ జగన్‌… 10.55 గంటలకు చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కళ్యాణమండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాల ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news