సీఎం జగన్ ని కలిశారు మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో

-

సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. ఈ సందర్భంగా తిరుపతిలోని వకుళమాత ఆలయం ప్రారంభోత్సవానికి రావలసిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈనెల 23 న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈనెల 18న అంకురార్పణం తో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎం జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news