రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11:00 నుంచి 12:55 వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3:25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news