తిరుమలలో కళ్యాణ మండపం నిర్మిస్తాం – సీఎం రేవంత్‌ రెడ్డి

-

తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం నిర్మించాలని భావిస్తూస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారి హరీంద్రనాథ్ రేవంత్కు స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించారు.

రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ….తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని… అభివృద్ది పథంలో నడవాలని కోరారు.


cm revanth reddy about tirumala

ఏపిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలసి ముందుకు సాగుతామన్నారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం నిర్మించాలని భావిస్తూన్నాం… నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రకియను ప్రారంభిస్తామని వెల్లడించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version