ఏపికి రూ.300కోట్ల భారీ పెట్టుబడులు..డిసెంబర్ లోనే శంకుస్థాపన

-

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌. తాజాగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను క్రిబ్‌కో చైర్మన్‌ డాక్టర్‌ చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌ కలిశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ శంకుస్ధాపనకు సీఎంను ఆహ్వనించారు చంద్రపాల్‌ సింగ్‌ యాదవ్‌. రూ. 300 కోట్లతో మొదటి దశ నిర్మాణం పనులు ప్రారంభించనున్న క్రిబ్‌కో.. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.

దీంతోపాటు డీఏపీ కాంప్లెక్స్‌ ఎరువుల తయారీకి సంబందించిన ప్రాజెక్ట్‌ ఏర్పాటుపై కూడా సీఎంతో చర్చించిన క్రిబ్‌కో చైర్మన్, సానుకూలంగా స్పందించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ నిర్వహించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఎం జగన్‌. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news