చిన్నమ్మ రాక… అమరావతిలో కాక!!

-

భారతీయ జనతా పార్టీలో దగ్గుబాటి పురందేశ్వరికి ఇన్నాళ్ళకు మంచి స్థానం దక్కింది. ఆమెను ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది అధిష్టానం! ఈ రకంగా ఏపీలో ఈ సామాజికవర్గానికి కూడా పెద్దపీట వేస్తున్నామని చెప్పడం వారి ఉద్దేశ్యం కావొచ్చేమో కానీ… ఈమె రాకతో పాలనారాజధానిగా విశాఖకు ప్లస్ అవుతుందనే విశ్లేషణలు మొదలైపోయాయి!

ప్రస్తుతం ఏపీలో కాపు సామాజికవర్గాన్ని పూర్తిగా వాడేసుకోవాలని ఫిక్సయిన బీజేపీ… సోము వీర్రాజు – పవన్ ల ను రంగంలోకి దింపి ప్రయత్నాలు ముమ్మరం చేసింది! ఈ క్రమంలో కమ్మ సామాజికవర్గానికి కూడా పెద్ద పీట వేస్తున్నామనే సంకేతాలు పురందేశ్వరికి ఇచ్చిన పదవి రూపంలో చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో ఏపీ పాలనా రాజధాని విశాఖ మీద గురి పెట్టి ఉంచిన బీజేపీ… విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో పార్టీ పటిష్టత కోసం పురందేశ్వరిని పుష్కలంగా ఉపయోగించుకోనుంది!!

ఈ క్రమంలో… ఏపీకి పాలనా రాజధాని విషయంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా పురందేశ్వరి ఉపయోగపడొచ్చనే కామెంట్లకు బలం చేకూరింది. వారి ప్రాంతానికి రాజధాని వస్తుంది అంటే పురందేశ్వరి వద్దు అంటారని ఎవరూ ఊహించడం లేదు! దీంతో అమరవతిలోనే రాజధాని ఉండాలని పాటపాడుతున్నవారు కాకెత్తిపోతున్నారని అంటున్నారు!

ఈ సమయంలో కొన్ని కీలక నిర్ణయాల్లోనూ, వాటిని అమలుచేసే విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ పెద్దల సహాయ సహకారాలు జగన్ కు చాలా ముఖ్యం! ఈ సమయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి, నారా వారికీ సంబంధాలు ఏమాత్రం బాగుండవు అంటారు కాబట్టి… కచ్చితంగా చిన్నమ్మ విశాఖలో పాలనా రాజధానికి జగన్ కు మద్దతు ప్రకటిస్తారని అంటున్నారు!! మరి ఏమి జరుగుతుందో వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news