‘డియర్ హర్షా చాలా గర్వంగా ఉందీ’..కూతురి మాస్టర్స్ డిగ్రీ పై జగన్ ట్వీట్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె వైఎస్ హర్షిని రెడ్డి మాస్టర్స్ లో సత్తా చాటారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు చెందిన వర్సిటీలో హర్షిని మాస్టర్స్ విద్యనభ్యసించారు. శనివారం ఆమె మాస్టర్స్ పట్టా అందుకున్నారు. కాగా కుమార్తె హర్షిని రెడ్డి మాస్టర్స్ పట్టా అందుకునే స్నాతకోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ తమ కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ వేడుకలో శనివారం సీఎం జగన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుమార్తెపై జగన్ తన ప్రేమను తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.” డియర్ హర్ష, నీ అద్భుతమైన ఎదుగుదలను చూసి మాకు ఎంతో గర్వంగా ఉంది. నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్సీడ్ బిజినెస్ స్కూలు నుంచి డిస్టింక్షన్ తో పాటు డీన్స్ జాబితాలో చోటు సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news