త్యాగనిరతికి ప్రతీక బక్రిద్.. ముస్లిం సోదరులకు డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు

-

నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలు రంజాన్ తర్వాత అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ బక్రీద్. దైవారాధన ప్రవక్త త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ ప్రవక్తను, త్యాగాలకు ప్రతీకగా బక్రీదన్ను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్న అంతే నిష్టతో చేస్తారని చెప్పారు. ఈ పండుగ ముస్లిం అందరికీ భగవదనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికే ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news