BREAKING : ఆర్ 5 జోన్ లో ఈ నెల 18న పేదలకు పట్టాల పంపిణీ

-

BREAKING : ఏపీ పేదలకు జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. అమరావతి ఆర్ 5 జోన్ లో పేదలకు భూ పంపిణీకి ముహుర్తం ఫిక్స్‌ చేసింది. ఈ నెల 18వ తేదీన పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది జగన్‌ సర్కార్‌. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి జగన్.. ఈ మేరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది ఇలా ఉండగా, ఏపీ ప్రజలకు శుభవార్త.. YSR మత్స్యకార భరోసా సాయం పంపిణీకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఈ నెల 15వ తేదీన ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయం లో ఉపాధి కోల్పోయే మత్స్య కార కుటుంబాలకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 10,000 భృతి అంది స్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news