ఏపీ మహిళలకు శుభవార్త.. నేటి నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.


ఈ కార్యక్రమానికి ఇవాళే ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఏలూరు జిల్లా దెందలూరు లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాలలో ఆయా ఎంపీ మరియు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ఈ వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగం గానే ఇప్పటికే రెండు విడతల్లో వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news