ఏపీలో ఘోరం… ఎలక్ట్రిక్ బైక్ పేలి భర్త మరణం… భార్యకు తీవ్ర గాయాలు

-

ఏపీలో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరు మృతి చెందగా… మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  ఈతాజాగా ఏపీలో మరో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. శనివారం ఉదయం విజయవాడ గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఓ ఫ్యామిలీ బైక్ కు ఛార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి మరణించగా… అతని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. 40 శాతం కాలిన గాయాలతో భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. బైక్ పై మరో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. శనిపోయిన వ్యక్తిని శివకుమార్ గా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన.

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైకులు వరసగా ఎక్కడో చోట ప్రమాదానికి గురవుతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల క్రితం ఇలాగే నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మరణించగా…ఇద్దరు గాయపడ్డారు. అంతకుముందు తమిళనాడులో ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి కూతురు మరణించారు. ఇలా ఎలక్ట్రిక్ బైకులు యమపాశాలుగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news