రాష్ట్రంలో ఒక్క మంచిపని జరిగినా విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి – మంత్రి కాకాని

-

రాష్ట్రంలో ఒక్క మంచి పని జరిగినా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నేడు అమరావతి వ్యవసాయ పరిశోధనా కేంద్ర ల్యాబ్ లను పరిశీలించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అవసరాలు తెలియని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వ్యవసాయ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడితే ఖర్చు తప్ప రాబడి ఉండదన్న ఏకైక సంస్కరణ కర్త ఆయనేనని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు – కరువు కవల పిల్లలని చురకలంటించారు. ఇక్కడి రైతు భరోసా కేంద్రాలు ప్రపంచంలోనే ఏకైక ఛాంపియన్ అవార్డుకు ఎంపిక అవ్వడమే ఉదాహరణ అని అన్నారు. ఎవరు ఏం చేసినా రాబోయే ఎన్నికలలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కాకాని.

Read more RELATED
Recommended to you

Latest news