హంసలదీవి బీచ్ లో ఐదుగురు పర్యటకులు గల్లంతు..!

-

హంసలదీవి బీచ్ లో గుడివాడకు చెందిన ఐదుగురు పర్యటకులు గల్లంతు అయ్యారు. అయితే ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా ముగ్గురుని తోటి పర్యటకులు, మెరైన్ పోలీసులు కలిసి కాపాడారు. కానీ ఆ ముగ్గురు సముద్ర నీరు తాగేయడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక సముద్రంలోకి కొట్టుకుపోయిన ఇద్దరిలో ఒక్కరు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. మృతి చెందిన షేక్ ఫజల (26) అని గుర్తించారు. ఇక గల్లంతైన వ్యక్తి ముషారఫ్ (20) అని తెలిపారు.

అయితే ఈరోజు ఉదయం గుడివాడ నుంచి హంసలదీవి బీచ్ వద్దకు విహారయాత్రకు వచ్చారు ఈ పర్యటకులు. ప్రస్తుతం గల్లంతయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మెరైన్ పోలీసులు. కాపాడిన ఆ ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మెరైన్ సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version