భక్తులకు శుభవార్త…నేటి నుంచి దుర్గమ్మ భక్తులకు ఫ్రీ బస్సులు

-

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి భక్తులకు అదిరిపోయే శుభవార్త. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి భక్తులకు నేటి నుంచి ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దుర్గాగుడి చైర్మన్, ఈవోలు జెండా ఊపి సేవలు ప్రారంభించనున్నారు. కొండపై నుంచి దిగువన దుర్గ ఘాట్ స్నానాల రేవు వరకు నిత్యం బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

కరోనాకు ముందు ఉచిత సేవలు ఉండగా, ఆ తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానం పురస్కరించుకొని 11న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజున బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. 10న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కాగా, టీటీడీ వెబ్ సైట్ లో అనుబంధ ఆలయాల సమాచారాన్ని త్వరలోనే అప్లోడ్ చేయాలని జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news