ఏపీ ప్రజలకు శుభవార్త..ఈనెల 19 నుంచి ఉచిత బియ్యం పంపిణీ

-

ఏపీ ప్రజలకు శుభవార్త. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తామని పౌరసరాఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.

అటు ప్రధానమంత్రి ‘గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 19 నుంచి జరిగే బియ్యం పంపిణీ కి సంబంధించి లబ్ధిదారుల జాబితా సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకుని.. రేషన్‌ బియ్యం తీసుకుని పోవాలని.. తెలియని వారికి ఈ విషయాన్ని చెప్పాలని కూడా కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news