BREAKING : ఏపీలో మరో గ్యాస్ లీకేజీ.. ఈసారి ఏకంగా..!

-

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో విశాఖ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నడుస్తున్న వారు నడుస్తూనే.. నిద్రపోతున్న వారు నిద్రలోనే కుప్పకూలిపోయారు. ఈ దృశ్యాలు చూసి కంటతడి పెట్టని కన్ను లేదు. అయితే ఈ తీవ్ర విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేలుకోకముందే.. అలాంటి ఘటన చిత్తూరు లో చోటుచేసుకుంది. జిల్లాలోని పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలోని హట్సన్ పాల డెయిరీ‌లో అమ్మోనియం గ్యాస్ లీకైంది.

ఈ ఘటనలో 13 మంది కార్మికులు అస్వస్థతకు గురైనట్టు అధికారులు జాబితాను ప్రకటించారు. వారిలో 12 మంది మహిళలే ఉన్నారు. దీంతో వారందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై విచారణకు అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై మాజీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news