వైఎస్‌ షర్మిలతో కాంగ్రెస్‌ పార్టీ టచ్ లో ఉంది – ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌

-

వైఎస్‌ షర్మిలతో కాంగ్రెస్‌ పార్టీ టచ్ లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు. షర్మిల కాంగ్రెస్ లో చేరతారాన్న దానిపై అధికారిక సమాచారం లేదని… వైఎస్ ఆర్ తనయురాలిగా షర్మిల ను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. హై కమాండ్ షర్మిల తో టచ్ లో ఉందని మాత్రం ఆయన చెప్పారు.

కాంగ్రెస్స్ ను సంస్తాగతంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు. జిల్లా స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో సమన్వయ కమిటీ లు నిర్వహిస్తున్నామని చెప్పారు. సిఎం జగన్ నాలుగేళ్లలో ఏం చేశారు..కడప స్టీల్ పరిశ్రమ ఏమైందని నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాయమయ్యాయి.. కడప లో పట్ట పగలే దారుణ హత్య జరిగిందన్నారు. పథకం ప్రకారం దళితుల పైన, అన్ని వర్గాల పై దాడులు, హత్యకు జరుగుతున్నాయని సీరియస్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version