సీఎం జగన్ గుడ్ న్యూస్..ఈ నెల 16న మత్స్యకార భరోసా పథకం నిధులు విడుదల

-

ఏపీ ప్రజలకు శుభవార్త.. YSR మత్స్యకార భరోసా సాయం పంపిణీకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఈ నెల 16వ తేదీన ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ టూర్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 16న సీఎం వైఎస్‌ జగన్‌ బాపట్ల జిల్లా నిజాంపట్నం పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ మేరకు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. నిజాంపట్నం బహిరంగ సభలో పాల్గొని వెఎస్సార్‌ మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 10,000 భృతి అందిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news