ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ స్కీమ్ కింద అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఖర్చు అవుతుందని.. తదుపరి క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలుపనున్నట్టు వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

ప్రధానంగా పేదలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్లు తదితర వాటిపై చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తోందని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version