సబ్బం హరీ.. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదా ఇంటికొచ్చి తంతా !

-

విశాఖ మాజీ మేయర్ సబ్బం హరిపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు… లేదంటే నాలుక కోస్తానని ఆయన హెచ్చరించారు. ఒక లోఫర్ ను ఈ ప్రాంత ప్రజలు మేయర్ ఎలా చేశారో అని ఆశ్చర్యం కలుగుతుందని ఆయన అన్నారు. సబ్బం హరి పొలిటికల్ బ్లాక్ మైలర్ అన్న ఆయన, జగన్ ను ఉద్దేశించి దూషణలు చేస్తే… నేనే స్వయంగా ఇంటికి వచ్చి తంతానని అన్నారు.

5 సంవత్సరాలు మేయర్ గా పనిచేసి వందలకొట్ల ఆస్తులు సంపాదించాడన్న ఆయన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే. అడగడం తప్పా అని గుడివాడ అమర్ ప్రశ్నించారు. ఇక తనకు నోటీసులు ఇవ్వకుండానే ఇంటి ప్రహరీ గోడను ఎలా కూల్చివేస్తారని జీవీఎంసీ అధికారులను మాజీ ఎంపీ సబ్బం హరి ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఓ వ్యక్తి కావాలనే ఇలా చేయించినట్లు ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news