ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం – గుడివాడ అమర్నాథ్

-

ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం అన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. హైదరాబాద్ లాగానే విశాఖపట్నం కూడా, కాస్మో పాలిటన్ కల్చర్ కలిగిన నగరం అని, ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు. ఆహ్లాదకరమైన వాతావరణం, సుదీర్ఘ సముద్ర తీరం వంటి సౌకర్యాలు విశాఖకు అదనం అని వాక్యానించారు.

ప్రపంచ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నం నగరాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు తో పాటు హైదరాబాద్-బెంగుళూరు కారిడార్లను ఏపీ కలిగి ఉందని వివరించారు. పారిశ్రామిక కేటాయింపులకు 48 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news