చంద్రబాబు వైసీపీలోకి వస్తే MLC పదవి ఇస్తాం – మంత్రి జయరాం

-

టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి గుమ్మనూరు జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైసీపీ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. లోకేష్ కూడా తమ పార్టీలో చేరితే కో – ఆప్షన్ మెంబర్ చేస్తామని సెటైర్ వేశారు. చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందని, ఎన్ని మాటలు చెప్పినా రాష్ట్ర ప్రజలు ఆయనను నమ్మరని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని అన్నారు.

చంద్రబాబు సానుభూతి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయనకి ఇప్పటికే చివరి ఎన్నికలు అయిపోయాయని.. 2024 ఎన్నికలలో చంద్రబాబు పోటీ చేయరని అన్నారు. అలాగే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక చంద్రబాబు అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news