చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది – మంత్రి కాకాని

-

చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడితే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ చెప్పినట్లు మేము మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ” నీ మేనిఫెస్టో ఎక్కడుంది. మేనిఫెస్టోని చంద్రబాబు సృష్టించి, ఆ మేనిఫెస్టో ని వెబ్సైట్ నుంచి తొలగించిన దొంగ, ఈ అవినీతిపరుడు, అక్రమార్కుడు ఇప్పుడు మాపై వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

చంద్రబాబును మించిన మోసగాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు సిగ్గుపడాలి. చంద్రబాబు ఎక్కడ పాదం మోపినా కరువు, దరిద్రం. ఆ పాదం మోపితే పచ్చడి ప్రదేశమైనా ఎండిపోతుంది. తన స్వార్ధ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను కూడా వీధిలోకి లాగిన వ్యక్తి చంద్రబాబు. తన పబ్లిసిటీ కోసం 8 మందిని బలి తీసుకున్నాడు” అని మండిపడ్డారు కాకాని.

Read more RELATED
Recommended to you

Latest news