అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా – మంత్రి ధర్మాన

-

ఇటీవల తనపై వస్తున్న ఆరోపణల పై స్పందించారు ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాల్ చేశారు. నేడు పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ధర్మాన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ మంత్రిగా ఒక సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని అన్నారు.

రాష్ట్ర కేబినెట్ మాత్రమే ఎవరికైనా భూములు కేటాయించగలదని స్పష్టం చేశారు. రెవెన్యూ మినిస్టర్ భూములు దొబ్బాడని ఆరోపణలు చేస్తున్నారు.. అసలు రెవెన్యూ మంత్రికి భూములు దొబ్బే అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. పత్రికలలో ఇలాంటి ఆరోపణలు చేస్తారు కానీ అందుకు నేను ఇచ్చే సమాధానం మాత్రం ఆ పత్రికలలో రాదన్నారు. ఇలాంటి వార్తలు రోజు టీవీలలో చూసి ప్రజలు ప్రభావితులవుతున్నారని అన్నారు మంత్రి ధర్మాన. తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించిన రాజకీయాలనుంచి తప్పుకుంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news