చంద్రబాబు లాగా ఇంగ్లీష్ మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా – మంత్రి కాకాని

-

నెల్లూరు: టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జీవితంలో ఎన్నడూ నిజాలు చెప్పని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా అన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటేనని.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్య నాదెళ్ల సీఈవోగా ఎదిగారని చంద్రబాబు చెప్పారని ఎద్దేవా చేశారు.

సత్యా నాదెల్ల 1992 లోనే మైక్రోసాఫ్ట్ లో చేరారని.. అప్పటికి చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రి కాలేదని అన్నారు. అబద్దానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అది చంద్రబాబు అని సెటైర్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మాట్లాడిన విషయంలో ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేనని.. చంద్రబాబు లాగా ఇంగ్లీష్ మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news