వారెవ్వా: యూట్యూబ్ లో అదరగొడుతున్న పవన్ “బ్రో” టీజర్…

-

నిన్న సాయంత్రం 6 .45 గంటలకు పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న తమిళ రీమేక్ సినిమా బ్రో టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ విడుదల అయిన కొన్ని గంటలలోనే ఏకంగా 17 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇంకా మరిన్ని వ్యూస్ ను సాధించే దిశగా దూసుకువెళుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ యు ట్యూబ్ లో నెంబర్ వన్ లో ట్రెండింగ్ అవుతోంది. సెకనుల నిడివి కలిగిన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ల మధ్య వస్తున్న డైలాగ్స్ ప్రేక్షకులు కట్టిపడేశాయి అని చెప్పాలి. ఇందులో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ను బ్రో అని పిలుస్తూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండడంతో అప్పుడే టీజర్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తోంది.

ఈ సినిమా జులై 28వ తేదీన థియేటర్ లలో రిలీజ్ కానుంది. మరి అప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ను ఆస్వాదిస్తూ ఎదురుచూడడమే ?

Read more RELATED
Recommended to you

Latest news