మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ తియ్యటి అబద్దాలు మాట్లాడారు – పేర్ని నాని

-

మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీయటి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు మేలుకోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అసత్యాలు మాట్లాడుతూ ఆయన నిస్సిగ్గుగా కుల రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. జనసేన అసలు రాజకీయ పార్టీనేనా అని ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్ ఏమైందో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.

పవన్ కళ్యాణ్ కు నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ – చంద్రబాబును విడివిడిగా కాదు.. కలిసి రావాలని సవాల్ విసిరారు. అందరినీ చితక్కొట్టి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ముసుగు తీసినందుకు సంతోషం అన్నారు పేర్ని నాని. బిజెపితో కటీఫ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ చిరంజీవిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారని చెప్పారు. రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ అన్న అని కూడా చూడరని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news