ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలకు తెర లేపడం మంచిది కాదు – ఆదిమూలపు

-

సక్యతగా ఉన్న వాతావరణంలో ఇరు రాష్ట్రాలలో లేనిపోని వివాదాలకు తెరలేపడం సరికాదని అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వివాదాలతో సఖ్యతగా ఉన్న వాతావరణం కలుషితం చేయడం తప్ప మరో పని కాదని అన్నారు. పోలవరం ఎత్తు పెంపు.. ముంపు గ్రామాలు కలపడం ముగిసిపోయిన అధ్యాయాలని అన్నారు మంత్రి ఆదిమూలపు. ఇది కేవలం వారి స్వార్థం కోసం మాట్లాడే మాటలు తప్ప వేరే ఒకటి కాదన్నారు.

మేము ఎక్కడా మా పరిధిని దాటలేదని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రుల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వరదల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, సీఎం జగన్ స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు. చంద్రబాబు పర్యటనలు చేసి నీళ్లలో దూకి విన్యాసాలు చేస్తే ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news