టీడీపీతో కలిస్తే జనసేన పతనం ఖాయం – మంత్రి కొట్టు సత్యనారాయణ

-

శనివారం సాయంత్రం హైదరాబాద్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులు, ప్రజా సమస్యలపై వీరిద్దరూ చర్చించారని సమాచారం. గతంలో ఈ ఇద్దరు నేతలు రెండు సార్లు కలుసుకోగా.. వీరి మధ్య ఇది మూడవ భేటీ. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వీరిద్దరూ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజాగా వీరి భేటీ పై మంత్రి కొట్టు సత్యనారాయణ. అంతరించిపోతున్న తెలుగుదేశం పార్టీతో జనసేన కలిస్తే ఆ పార్టీ పతనం అవ్వడం ఖాయమని అన్నారు. చంద్రబాబును నమ్మి పవన్ కళ్యాణ్ రాజకీయంగా పతనం అవుతున్నారని.. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే ముందు ఈ రెండు పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news