రేషన్ కార్డు దారులకు జగన్ సర్కార్ బిగ్ షాక్.. వాటిలో కోతలు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అంటే 2019 జూన్ మాసంలో… ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు 92 లక్షల కిలోల కందిపప్పు, 64 లక్షల కిలోల పంచదార, 14 లక్షలు కిలోల గోధుమ పిండి, రెండు లక్షల కిలోల ఉప్పు అందించారు.

అయితే 2022 సెప్టెంబర్ మాసంలో బియ్యం తో పాటు 31 లక్షల కిలోల కందిపప్పు, 40 లక్షల కిలోల పంచదార మాత్రమే ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో రేషన్ కార్డు దుకాణానికి వెళితే బియ్యం తప్ప మరేమీ దొరకవని ఎన్నికల ప్రచారంలో చెప్పిన సీఎం జగన్… తాను అధికారం చేపట్టాక అప్పటి వరకు ఇస్తున్న నిత్యవసరాలకు కోత పెట్టారు. ఇందులో ఇంకా కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్‌. దీంతో రేషన్ కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news