వైసీపీ పార్టీని కబ్జా చేసిన రాక్షసుడు – జగన్ పై నారా లోకేష్ సంచలన ఆరోపణలు

-

వైసీపీ పార్టీని కబ్జా చేసిన రాక్షసుడు అని జగన్ పై నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడిని జగన్ రెడ్డి అంటాం.శివ కుమార్ పెట్టిన పార్టీని కబ్జా చేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం అని ఫైర్ అయ్యారు.

సొంత చెల్లిని గెంటేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం.తల్లిని గౌరవించని వాడిని జగన్ రెడ్డి అంటాం.బాబాయ్ పై గొడ్డలి వేటు వేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం.లక్ష కోట్లు మింగి 16 నెలలు చిప్పకూడు తిన్న వాడిని రాక్షసుడు జగన్ రెడ్డి అంటామని ఆరోపించారు.

 

నలుగురు రెడ్లతో కూడిన జగన్ గ్యాంగ్, వీరికి మద్దతుగా వున్న బ్లూ మీడియాని దండుపాళ్యం బ్యాచ్ అంటాం.టిడిపికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని వైసీపీ ముష్కరమూకలు ఇటీవల చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్లదాడికి తెగబడ్డాయి. ఇప్పుడు తాడిపత్రి మూడోవార్డులో పర్యటిస్తున్న టిడిపి నేత జేసీ అస్మిత్ రెడ్డి పై దాడికి బరి తెగించాయి. వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news