జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి రోజా

-

ఆంధ్రప్రదేశ్ లో నేడు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించారు మంత్రి ఆర్.కే.రోజా. స్పోర్ట్స్ మరియు శాప్ శాఖలపై మంత్రి రోజా సమీక్ష నిర్వహించారు. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో శాప్ మరియు క్రీడా శాఖా అధికారులతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. జగనన్న స్పోర్ట్స్ యాప్ ద్వారా క్రీడాకారులు వారి సంక్షిప్త సమాచారాన్ని అందిస్తే…వారి సమాచారం క్రీడాశాఖకు చేరడంలో సులభతరం కానుందని అన్నారు.

ఈ యాప్ ద్వారా సమాచారం అందించడం ద్వారా క్రీడాకారులకు ప్రభుత్యం నుండి మరింత ప్రోత్సాహకాలు అందిచనున్నామని తెలిపారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తుంచడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యమని అన్నారు మంత్రి రోజా. ఈ లక్ష్యం దిశగా క్రీడాశాఖ ముందుకు వెళ్ళేందుకు, క్రీడకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ యాప్ దోహదం చేస్తుందని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడం జగనన్న ప్రభుత్వం ‌లక్ష్యం అని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు.

Read more RELATED
Recommended to you

Latest news