ప్రశాంత్ కిషోర్ పై బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

-

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ ను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించారు. పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ చేసే ప్రకటనలకు అర్థం లేదని అన్నారు. ఎన్నికల వ్యూహకర్త బిజెపి కోసం రహస్యంగా పనిచేస్తున్నాడని విమర్శించారు.

బీహార్ లో ఆయన చేయాలనుకున్నది చేయనివ్వండి అని అన్నారు. 2005 నుంచి బీహార్ లో ఏం జరిగిందో ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. వారికి పబ్లిసిటీ ఎలా తీసుకోవాలో.. స్టేట్మెంట్లు ఎలా ఇవ్వాలో తెలుసు, వారు అందులో నిష్ణాతులు అని అన్నారు. ఆయనకు బిజెపితో ఉండాలని మనసులో ఉన్నట్టుందనిని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ చేసే ప్రకటనలకు అర్థం లేదని అన్నారు నితీష్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news