అనకాపల్లిలో కీచక ప్రొఫెసర్.. విద్యార్థినిపై లైంగిక వేధింపులు

-

విద్యాబుద్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు కీచకులుగా మారుతున్నారు. ఏకంగా విద్యార్థినులతోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే అంతటి గౌరవం ఇవ్వాలని మనందరం చదువుకునే ఉంటాం.కానీ, కొందరు తమ స్థాయి, గౌరవప్రదమైన వృత్తిని మరిచి మృగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. తమ బిడ్డలుగా భావించాల్సిన వారిపైనే కామ దృష్టితో చూస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఏపీలోని అనకాపల్లి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

అనకాపల్లిలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివే ఓ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన, వేధింపులు భరించలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అనకాపల్లి పట్టణ పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే, విద్యార్థిని చదివే కాలేజీ అధికార పార్టీకి చెందినది కావడంతో కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version