కొడాలి నానీ లారీ క్లీనర్… టీడీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా వైరస్ తీవ్రత ఒక రేంజ్ లో ఉన్నా సరే అధికార పార్టీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కరోనా వ్యవహారం చల్లారక ముందే, ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీనితో మాటల యుద్ధం ఒక స్థాయిలో పెరుగుతుంది. మంత్రి కొడాలి నానీ తెలుగుదేశం పార్టీ మీద శనివారం మీడియా తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

దీనిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత యరపతనేని శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కొడాలి నానీ లారీ క్లీనర్ అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. మంత్రులు కుక్కలా మొరగడం ఇంట్లో పడుకోవడం అలవాటైందని ఆయన మండిపడ్డారు. లారీ క్లీనర్‌గా ఉన్న కొడాలి నానికి రాజకీయభిక్ష పెట్టింది చంద్రబాబు అని ఈ సందర్భంగా యరపతనేని వ్యాఖ్యానించారు.

అదే విధంగా తన శాఖపై మరో మంత్రి ప్రెస్ మీట్ పెట్టడంపై కొడాలి నాని సిగ్గుపడాలని యరపతనేని హితవుపలికారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో ప్రభుత్వం కుమ్మక్కు సిగ్గుచేటని యరపతనేని దుమ్మెత్తి పోశారు. గంజాయి, సారా, మట్టి, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని యరపతనేని వ్యాఖ్యానించారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంలో వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ వ్యాఖ్యలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news