కోడెల కుటుంబంపై టీడీపీ అధిష్టానం వివక్ష చూపుతోంది – కోడెల శివరామ్

-

కోడెల కుటుంబంపై టీడీపీ అధిష్టానం వివక్ష చూపుతోందని ఫైర్‌ అయ్యారు కోడెల శివరామ్. టీడీపీ కోసం పని చేసి ప్రాణాలు వదిలిన కోడెల కుటుంబాన్ని పార్టీ పక్కన పెడుతోందని నా బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసిన కీలక నేతల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటోందని.. మరి కోడెల కుటుంబం పట్ల ఎందుకు ఇలా వివక్ష అని ఫైర్‌ అయ్యారు.

కోడెల భార్యకు, మా అమ్మ కు సరైన గౌరవం లేదని మండిపడ్డారు. చంద్రబాబును కలిసి మా బాధను చెప్పటానికి 5 నిమిషాలు సమయం ఇవ్వటం లేదు… కొందరు కావాలని కోడెల కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా పనిచేస్తున్న మాకు క్లారిటీ ఇవ్వని నేతలు ఇప్పుడు కన్నా విషయంలో ఫోన్లు చేసి కన్నాకు సహకరించాలని చెప్పటం ఎంటి అని నిలదీశారు. చంద్రబాబు పై విమర్శలు చేసి కోర్టులో కేసులు వేసిన వ్యక్తి కన్నా అని.. కోడెల రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న కన్నాను ఎలా అదే స్థానంలో పోటీకి దింపుతారా అని ప్రశ్నించారు. మేం పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తులము కాదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news