ఏపీ ముందస్తు ఎన్నికలు రావొచ్చు : మంత్రి కొట్టు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వాక్యాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చు అన్నారు. ఏపీలో ముగ్గురు మాత్రమే సీఎం జగన్ ను వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పెళ్లి ఒకరితో సంసారం మరొకరితో అన్నట్లుగా ఉందన్నారు మంత్రి కొట్టు. జైలుకెళ్లి సాష్టాంగ నమస్కారంతో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపించారు. జనసేనతో కలవడం వల్ల ఎంతోమంది నేతలు టీడీపీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మంత్రి కొట్టు. ఇంకో వైపు, పవన్‌పై అభిమానంతో పార్టీకి సేవ చేయాలనుకున్న జనసైనికులు.. ఇప్పుడు చంద్రబాబుకు సేవ అనగానే సగం మంది జనసేనకు దండం పెట్టి వెళ్లిపోయారన్నారు మంత్రి కొట్టు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..వైసీసీ గెలుస్తుందన్నారు మంత్రి కొట్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version