జగనాసుర అవినీతి రక్త చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తాం – కాల్వ శ్రీనివాస్

-

అమరావతి: వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాస్. ఏపీలో వివిధ మార్గాల ద్వారా మొత్తంగా సుమారు రూ. 1.20 లక్షల కోట్లు జగన్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. భూ దోపిడీ రూ. 40 వేల కోట్లు, ఇసుక దోపిడీ రూ. 10 వేల కోట్లు, మైనింగ్ దోపిడీ రూ. 30 వేల కోట్లు, మద్యం ద్వారా దోపిడీ రూ. రూ. 40 వేల కోట్లు.. ఇలా అన్ని రంగాలలో దోపిడీకి పాల్పడుతుందన్నారు.

మా ఆరోపణలు పచ్చి నిజాలని.. గతంలో రూ. లక్ష కోట్ల దోపిడీ అంటే.. రూ. 43 వేల కోట్లు అక్రమాలు జరిగాయని సీబీఐ ఛార్జ్ షీట్ వేసిందన్నారు. సరస్వతి పవర్స్ కంపెనీలో సీఎం జగన్ అధికార దుర్వినియోగమేంటో తేలిందన్నారు కాల్వ శ్రీనివాస్. ప్రజాధనం దోపిడీ చేస్తున్న జగన్ సీఎం సీట్లో కూర్చొడానికి అర్హుడు కాడన్నారు. జగనాసుర అవినీతి రక్త చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version