ఆణిముత్యం: ఒక్క డైలాగ్ తో జగన్ రేంజ్ పెంచేసిన లోకేష్!!

-

టీడీపీ ఆశాకిరణం చినబాబు లోకేష్ కు తిట్లకూ పొగడ్తలకూ తేడా తెలుసుతో తెలియదో తెలియదు కానీ… జగన్ ని విమర్శించాలనే ఉత్సాహంలో తమను తాము ఇరుకించుకోవడమే కాకుండా.. జగన్ రేంజ్ ని ఆకాశానికెత్తేశారు! మొడీని పొగడాలనే క్రమలో జగన్ స్థాయి చాలా ఎక్కువని చెప్పకనే చెప్పేశారు! అవేమిటో ఇప్పుడు చూద్దాం…!!


వర్షాలు కాస్త తెరుపిచ్చేసరికి జిల్లాల్లో పర్యటిస్తున్నారు చినబాబు లోకేష్. వరద బాధితుల పరామర్శకని వెళ్లి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అందులో మొదటిది.. “జగన్ ‌రెడ్డి ఆకాశంలోనే ఎక్కువకాలం పయనిస్తున్నారు. గాలి ప్రయాణాలు తగ్గించి ఆయన ఓ సారి కింద కాలు పెట్టాలి” అని! దీంతో… గతంలో చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో చేసిన యాత్రల లిస్టు, ఖర్చుల వ్యవహారాల లిస్ట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేయిస్తున్నారు నెటిజన్లు!

అసలు ప్రత్యేక విమానాలు, దేశీ విదేశీ యాత్రలు అనవసరమైనన్ని చేసి ప్రజాధనాన్ని వృధా చేసింది చంద్రబాబు! ఈ విషయం మరిచిన చినబాబు… బౌన్స్ బ్యాక్ అయ్యే విమర్శలు చేశారు! ఇదే సమయంలో చినబాబు నుంచి జాలువారిన మరో మాట… “రాష్ట్రంలో పరిస్థితిని ఏ సీఎం అయినా ప్రధానికి వివరిస్తారు. కానీ ప్రధానమంత్రే సీఎంకు ఫోన్‌ చేసి తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది” అని! ఇంతకు మించిన గొప్పతనం ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుందా? హస్తినలో జగన్ రేంజ్ లో ఆ రేంజ్ లో ఉన్నట్లే కదా!

ఇక్కడ మరొక విషయం ఏమీటంటే… జగన్ పక్షం రోజుల క్రితమే కేంద్రప్రభుత్వానికి లేఖ రాసి 2600 కోట్ల రూపాయలు సహాయం అందించాలని కోరడంతో పాటు వరద నష్టాన్ని అంచనా వేయడానికి ఒక బృందాన్ని పంపమని కూడా కోరారు! ఆ విషయాన్ని మరిచిన చినబాబు.. జనాలు కూడా మరిచారని భావించి.. జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని సాయం అడగడం లేదని చెప్పుకొస్తున్నారు! నేరుగా మోడీనే జగన్ కు ఫోన్ చేసి వివరాలు అడుగుతున్నారని మోడీ లెవెల్ వెడల్పు చేయాలని తాపత్రయపడుతున్నారు! కాని విచిత్రం ఏమిటంటే… మోడీ లెవ్ల్ వెడల్పు చేసే క్రమంలో… జగ్న రేంజ్ పెంచేశారు! ఫలితంగా… అయ్యో.. చినబాబూ అంటూ తమ్ముళ్లు తలలుపట్టుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news