మార్గదర్శి ఖాతాదారులు జాగ్రత్తలు తీసుకోవాలి – మంత్రి అంబటి రాంబాబు

-

మార్గదర్శిలో చిట్ లు వేసే ఖాతాదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. మార్గదర్శి చట్టాన్ని ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రామోజీ సంస్థలన్నీ చట్ట వ్యతిరేకంగా నిర్మితమయ్యాయని.. అవన్నీ ఒక్కొక్కటిగా తేటతెల్లమవుతున్నాయని అన్నారు. రామోజీరావు చట్ట వ్యతిరేకంగా మార్గదర్శిని నడుపుతున్నారని, మార్గదర్శి కూడా విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు.

” రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, చిట్ ఫండ్స్ డబ్బులు ఇతర సంస్థలకు మళ్లించకూడదు. అక్రమంగా డిపాజిట్లు తీసుకోబోమని కోర్టులకు చెప్పి.. ఇంకా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. చిట్ పడుకున్న వారి షూరిటీలను నిరాకరిస్తూ నాలుగు నెలలు తిప్పి చిట్స్ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఆ డబ్బులను తమ ఇతర సంస్థలలో పెట్టుబడులుగా పెడుతున్నారు. గత 60 ఏళ్లుగా రామోజీరావు ఇదే చేస్తున్నారు ” అని మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news