జనసేన పదో ఆవిర్భావ సభకు మచిలీపట్నంలో భారీ ఏర్పాట్లు

-

జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభకు మచిలీపట్నంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపించేలా భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సభా ప్రాంగణం 60 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కి 30 ఎకరాలు కేటాయించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వారి సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నారు జనసేన పార్టీ నేతలు.

ఇక సభా ప్రాంగణంలో మహిళలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ రేపు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news