అలా చేయకపోతే వైసీపీ ఉద్యమాలు చేయటానికి రెడీ..!

-

చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసేరకంగా ఉంది అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలపై ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ విషం కక్కారు. వైద్య విద్యని అమ్మేశారంటూ మాట్లాడారు. కానీ ఇప్పుడు వైద్య విద్యని ఇప్పుడు ప్రయివేటుకు ధారాదత్తం చేస్తున్నారు. ఏపీలో 12 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉంటే జగన్ వచ్చాక మరో 17 తెచ్చారు. చంద్రబాబు ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీనైనా తెచ్చారా అని ప్రశ్నించారు.

పేదల గురించి జగన్ ఆలోచిస్తారు కాబట్టే కొత్తగా మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఏపీలో 750 సీట్లు జగన్ పెంచగలిగారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి పేదలకు వైద్యాన్ని అందించారు. 17 కాలేజీలను పూర్తి చేసి వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. ఈ కాలేజీలను ప్రయివేటు పరం చేయాలనుకోవటం కరెక్టు కాదు. వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలి లేకపోతే వైసీపి ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుంది అని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news