మంత్రి అవంతికి కరోనా.. వైసీపీ నేతల్లో టెన్షన్..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా.. ఈ మహమ్మారి బారిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు వెంకట శివసాయి నందీష్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ మేరకు మంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని మంత్రి కోరారు. కాగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ మధ్య జోరుగా పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో విశాఖపట్నం నేతల్లో టెన్షన్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news