సీఎం జగన్ సమావేశానికి దూరమైన మంత్రి ధర్మాన

-

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో సీఎం జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మన భవిష్యత్తు తదితర కార్యక్రమాలను సమీక్షించనున్నారు.

అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లతో పాటు నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి మంత్రి ధర్మాన ప్రసాద్ దూరమయ్యారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్లే ఆయన ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కాలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాగోలు గ్రామంలో ఆసరా పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news