చంద్రబాబుకే కాదు.. టీడీపీకే ఇవి చివరి ఎన్నికలు – మంత్రి గుడివాడ

-

చంద్రబాబుకే కాదు.. టీడీపీకే ఇవి చివరి ఎన్నికలు అంటూ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ హాట్‌ కామెంట్‌ చేశారు. నిన్న చంద్రబాబు చేసిన కామెంట్లకు మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ కౌంటర్‌ ఇస్తూ… చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. చంద్రబాబుకే కాదు టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలు అన్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని.. ఎవర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు?? అని ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబు పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని.. తులసి నీళ్ళు పోస్తేనే బ్రతుకుతాను అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి చేశాడు?? చంద్రబాబు క్రికెట్ టీం లో కోహ్లి లాంటి వాడు కాదు కదా అని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్స్‌ట్రా ప్లేయర్ అని.. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాలన్నారు. అలా చెప్పలేకపోతే 2019 ఎన్నికలే చంద్రబాబు చివరి ఎన్నికలు అవుతాయి.. అధికారం కోసం భార్యను కూడా బజారుకు లాగుతున్నాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news