చంద్రబాబు కుప్పంలో గడప గడపకు వెళితే ఉమ్మేస్తారు – మంత్రి కారుమూరి

-

టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కుప్పానికి చంద్రబాబు కంటే సీఎం వైఎస్ జగన్ ఎక్కువ సార్లు వెళ్ళారని అన్నారు. 30 ఏళ్లలో చంద్రబాబు కుప్పానికి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు మంత్రి కారుమూరి. ఈ మూడేళ్లలో అభివృద్ది ఎలా ఉంటుందో జగన్ చేసి చూపించారని అన్నారు. అది చూసి మూకుమ్మడిగా కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ కి పట్టం కట్టారని అన్నారు.

దీంతో చంద్రబాబు కుప్పకూలి కింద కూర్చున్నాడని ఎద్దేవా చేశారు. అంతేకాదు కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడో చూపించగలడా అంటూ సవాల్ విసిరారు. ఈ మూడేళ్లలో మేము ఏమి చేశామో చూపిస్తామన్నారు. చంద్రబాబు పొత్తులు లేకుండా గెలవలేడని.. జగన్ సింగిల్ గా వచ్చి సీఎం అయ్యారని అన్నారు. బేధాలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేయబట్టే మమ్మల్ని ఆదరించారని అన్నారు. టిడిపి నాయకులు నిన్న ఏ రకమైన అరాచకం సృష్టించారో అందరూ చూశారని.. చంద్రబాబు రెచ్చగొట్టబట్టే అక్కడ అంత గొడవ జరిగిందన్నారు.

ఏదో ఒక అలజడి సృష్టించి అరాచకం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. చెప్పింది, చెప్పనిది కూడా చేసి 175 సీట్లు సాధించాలి అని జగన్ భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కుప్పంలో గడప గడపకు వెళితే ఉమ్మెస్తారని అన్నారు మంత్రి కారుమూరి.

Read more RELATED
Recommended to you

Latest news